Wednesday, May 15, 2024

TTD | కపిలేశ్వరస్వామికి 14 లక్షల విలువైన వెండి ఆభరణాలు

తిరుమల,ప్రభ న్యూస్‌: తిరుపతిలోని కపిలేశ్వరస్వామివారికి తిరుపతికి చెందిన సూర నరహరి, కుసుమ దంపతులు దాదాపు రూ.14 లక్షల విలువగల 16 కేజీల వెండితో తయారు చేసిన ఆభరణాలను సమర్పించారు. బుధవారం ఆలయంలో ఈ ఆభరణాలను దాతలు టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డికి అందచేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీఈవో దేవేంద్రబాబు, ఏఈవో సుబ్బరాజు, సూపరింటెండెంట్‌ భూపతి, టెంపుల్‌ ఇన్స్‌పెక్టర్‌ రవికుమార్‌, అర్చకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement