Thursday, May 2, 2024

ముక్కంటి సన్నిధిలో సింగర్ మంగ్లీ..

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా సింగర్ మంగ్లీ కుటుంబ సమేతంగా విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా ప్రత్యేకంగా రాహుకేతు పూజలు జ‌రిపించారు. కాగా మంగ్లీకి, కుటుంబ‌స‌భ్యుల‌కు ఆలయ సిబ్బంది దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేపట్టారు.రాహు కేతు పూజ అనంతరం, స్వామి అమ్మవార్లను దర్శించుకుని గురుదక్షిణామూర్తి సన్నిధానం వద్ద వేద పండితుల ఆశీర్వచనం తీర్థప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శ్రీకాళహస్తీశ్వర దర్శనార్థం రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. తెలంగాణ ..ఆంధ్ర ప్రభుత్వాలు చిన్న కళాకారులకు తగిన గుర్తింపు ఇవ్వాలని కోరారు. కార్తీకమాసంలో పూజలు నిర్వహిస్తే ఎంతో మంచిదన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బందితో పాటు ఆమె అభిమానులు నాగమణి, మాధురి , హేమలత, చెర్రీ తదితరులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement