Monday, May 20, 2024

కేకే ఆత్మకు శాంతిచేకూరాల‌ని ప్రార్థిస్తున్నా – ప‌వ‌న్ క‌ల్యాణ్

సింగ‌ర్ కేకే అకాల మ‌ర‌ణం బాధ క‌లిగించింద‌ని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక బాణీ ని కలిగిన గాయకుడు కేకే ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాన‌ని తెలిపారు. నా చిత్రాల్లో ఆయన ఆలపించిన గీతాలు అభిమానులను, సంగీత ప్రియులను అమితంగా మెప్పించాయి . ఖుషి చిత్రం కోసం ‘ఏ మేర జహా’ గీతం అంద‌రికి చేరువైందన్నారు. జల్సా సినిమాలో ‘మై హార్ట్ ఇస్ బీటింగ్’..అదోలా: బాలు.. ‘ఇంతే ఇంతింతే’ జానీ సినిమాలో ‘నాలో నువ్వొక సగమై’ గుడుంబా శంకర్ లో ‘లే లే లేలే’ గీతాలను నా చిత్రాల్లో ఆయన పాడారని గుర్తుచేసుకున్నారు. సంగీత కచేరీ ముగించుకున్న కొద్దిసేపటికే హఠాన్మరణం చెందడం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఆయన చివరి శ్వాస వరకు పాడుతూనే ఉన్నారు, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని, ఆ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాన‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement