Thursday, May 9, 2024

మంత్రుల బ‌స్సు యాత్ర తుస్సు యాత్ర అయింది : మాజీ మంత్రి పీత‌ల సుజాత‌

ఏపీలో మంత్రుల బ‌స్సు యాత్ర తుస్సు యాత్ర అయ్యిందని మాజీ మంత్రి పీత‌ల సుజాత అన్నారు. రాష్ట్రంలో మంత్రులంతా నోరులేని గొర్రెల్లా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని మండిప‌డ్డారు. కొత్త కార్పొరేష‌న్ల‌లో క‌నీసం కుర్చీలు కూడా లేవ‌న్నారు. ద‌ళిత మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాల గురించి తెలియ‌ని దుస్థితిలో హోం మంత్రి ఉన్నార‌న్నారు. మంత్రుల కుటుంబాల్లో ఎవ‌రిపైనైనా అత్యాచారం జ‌రిగితే ఆ బాధేంటో వారికి తెలుస్తుంది ఆమె మండిప‌డ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement