Thursday, April 25, 2024

మోస‌గాళ్లు బాగుప‌డ‌లేర‌న్న సిద్దార్థ్..నిజ‌మేన‌న్న పూన‌మ్ కౌర్..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సమంతా నాగచైతన్య విడాకుల అంశం సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఉంది. ఇన్నాళ్ల సస్పెన్స్ కు తెర దించేలా నాగ చైతన్య మరియు సమంతలు ఇద్దరు కూడా ఒకే నోట్ ను తమ తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేశారు. చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎవరి దారిలో వారు నడవాలనే నిర్ణయానికి వచ్చేశాం. మా ప్రైవసీకి భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించకూడదు అంటూ నోట్ లో పేర్కొన్నారు. అయితే వారి నిర్ణ‌యం త‌ర్వాత అభిమానులతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు షాక్ అయ్యారు. ఎంతో చూడ‌చ‌క్కగా ఉండే ఈ జంట ఇలా విడిపోవ‌డం బాధ‌ను క‌లిగిస్తుంద‌ని ప‌లువురు పేర్కొన్నారు. అయితే సామ్ విడాకులు ప్ర‌క‌టించిన కొద్ది సేప‌టికి సిద్దార్థ్ చేసిన ట్వీట్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. మోస‌గాళ్లు ఎప్ప‌టికీ బాగు ప‌డ‌లేదు. ఇది చిన్న‌ప్పుడు స్కూల్‌లో టీచ‌ర్స్ నేర్పిన పాఠం.. మీరు ఏమంటారు అని సిద్దార్థ్ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌కు పూనమ్ కౌర్ స్పందించింది. అవును అది నిజమే అని రిప్లై ఇచ్చింది. ఈ ట్వీట్ చేసింది ఎవ‌రి గురించి అంటూ సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ డిస్క‌షన్స్ న‌డుస్తున్నాయి. కాగా, చైత‌న్య‌ని పెళ్లి చేసుకునే ముందు స‌మంత- సిద్దార్థ్‌తో పీక‌ల్లోతు ప్రేమాయ‌ణం న‌డిపిన విష‌యం తెలిసిందే.

ఇది కూడా చదవండి: చై- సామ్ విడాకులపై నాగార్జున ఏం అన్నారంటే..

Advertisement

తాజా వార్తలు

Advertisement