Friday, May 17, 2024

సిద్ధ‌రామ‌య్య‌కి త‌గిన భ‌ద్ర‌తనిస్తాం-సీఎం బ‌స‌వ‌రాజ్ బొమ్మై

సిద్ధ‌రామ‌య్య‌కి త‌గిన భ‌ద్ర‌త‌తో పాటు స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపిస్తామ‌ని హామీ ఇచ్చారు సీఎం బ‌స‌వ‌రాజ్ బొమ్మై. క‌ర్ణాట‌క మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్యను హతమారుస్తామని వచ్చిన బెదిరింపు కాల్స్ పై విచారణకు ఆదేశించినట్లు బసవరాజ్ బొమ్మై తెలిపారు. ఈ మధ్య కొడగు పర్యటనలో సిద్ధరామయ్య కారుపై గుడ్లు విసిరి, నల్ల జెండాలు ప్రదర్శించిన తర్వాత ఆయన భద్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి స్పందించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటుందని, దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తామని సిద్ధరామయ్యకు హామీ ఇచ్చారని సీఎం బొమ్మై తెలిపారు. బెదిరింపు కాల్స్‌కు సంబంధించిన వివరాలు ఇవ్వాలని సిద్ధరామయ్యను కోరానని, వాటిపై సమగ్ర విచారణ జరిపిస్తానని ఆయన మీడియాకు వివరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి డీజీపీతో కూడా మాట్లాడినట్లు ఆయన తెలిపారు. ఈ విషయంపై ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని, ఇతరులను రెచ్చగొట్టేలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేలా ఎవరూ ప్రకటనలు చేయవద్దని ఎస్పీలందరికీ ఆదేశాలు ఇవ్వాలని డీజీపీని కోరాను.

Advertisement

తాజా వార్తలు

Advertisement