గుజారాత్ రాష్ట్రంలోని మోర్బీలోని మచ్ఛు నదిపై నిర్మించిన ఈ తీగల వంతెన గతేడాది అక్టోబర్ 30న కూలిపోయిన విషయం తెలిసిందే. వంతెన కూలడానికి కారణాలను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. వంతెనను నిలిపిఉంచే ఓ కేబుల్లో సగానికి పైగా ఇనుప వైర్లు తప్పుపట్టిపోయాయని, వంతెనపై పాత సస్పెండర్లను కొత్త వాటితో కలుపుతూ చేసిన వెల్డింగ్కు కూడా తుప్పపట్టిందని నివేదికలో పేర్కొంది. ప్రమాదానికి దారి తీసిన కారణాల్లో ఇవి ప్రధానమైనదని పేర్కింది. వంతెనకు ఆధారమైన రెండు ప్రధాన కేబుళ్లలో ఒకదానిలోని ఇనుప వైర్లు ప్రమాదానికి ముందే తెగిపోయి ఉండొచ్చని అభిప్రాయపడింది సిట్ బృదం. ఈ మేరకు సిట్ తన ప్రాథమిక దర్యాప్తు నివేదికను గత డిసెంబర్లోనే ప్రభుత్వానికి సమర్పించినట్టు తెలుస్తోంది. సిట్ నివేదిక ప్రకారం.. నదికి ఎగువ వైపున ఉన్న వంతెన కేబుల్ ఒకటి తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement