Thursday, April 18, 2024

అందుకే రాలేక‌పోతున్నాం.. మోహ‌న్ బాబు

నంద‌మూరి తార‌క‌ర‌త్న మర‌ణ వార్త తెలిసిన వెంట‌నే సోష‌ల్ మీడియాలో ఆవేద‌న వ్య‌క్తం చేశారు క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు. అయితే తార‌క‌ర‌త్న భౌతిక కాయానికి నివాళి అర్పించడానికి రాలేదు. ఆయన ఎందుకు రాలేదనే ప్రశ్న చాలా మందిలో తలెత్తింది. దీనికి ఆయన వివరణ ఇచ్చారు. ప్రస్తుతం తాను లండన్ లో, మంచు విష్ణు సింగపూర్ లో ఉండటం వల్ల వ్యక్తిగతంగా రాలేకపోతున్నామని ఆయన వివరించారు. తన అన్నగారైన నందమూరి తారక రామారావుగారి మనవడు తారకరత్న తనకు, తన కుటుంబానికి అత్యంత ఆత్మీయుడని చెప్పారు. ఆయన ఎంత మంచి వ్యక్తో, సౌమ్యుడో చెప్పడానికి తనకు మాటలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement