Monday, April 29, 2024

రైల్వే చార్జీల్లో సీనియర్‌ సిటిజన్స్‌కు షాక్‌.. రాయితీలు ఎత్తేసిన కేంద్రం

న్యూఢిల్లి : భారతీయ రైల్వే ఇక నుంచి ఛార్జీల్లో సీనియర్‌ సిటిజన్‌ రాయితీలతో సహా ఇతర ప్రయాణికులకు రాయితీ టికెట్లను ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కేంద్ర రైలే, కమ్యూనికేషన్స్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రి అశినీ వైష్ణవ్‌ పార్లమెంట్‌లో ప్రకటించారు. శీతాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. కరోనా మహమ్మారి, ప్రొటోకాల్‌ల దృష్ట్యా ఈ రాయితీని ఇవ్వలేమన్నారు. నాలుగు కేటగిరీల దివ్యాంగులు, 11 కేటగిరీల రోగులు, విద్యార్థులు మినహా అన్ని కేటగిరీలకు రైల్వే రాయితీ టికెట్‌ సౌకర్యం రద్దు చేసింది.

మార్చి 2020కి ముందు సీనియర్‌ సిటిజన్ల విషయంలో అన్ని తరగతుల్లో రైలేలో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు 50శాతం, పురుషులకు 40 శాతం తగ్గింపు ఇచ్చారు. ఈ రాయితీ పొందాలంటే.. వయో పరిమితి వృద్ధ మహిళలకు 58, పురుషులకు 60 ఏళ్లు ఉండాలి. భారతీయ రైలేలు సీనియర్‌ సిటిజన్లు, విద్యార్థులు, క్రీడాకారులు, వైద్య నిపుణులు మొదలైన వారితో సహా 53 వర్గాలకు రాయితీలను అందిస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా కొన్ని రాయితీలు తీసేశారు. ప్రస్తుతం విద్యార్థులు, కొన్ని వైద్య పరిస్థితులు ఉన్న వ్యక్తులు మాత్రమే రాయితీకి అర్హులు. భారతీయ రైల్వే ఫొటోగ్రాఫ్‌, సంతకాన్ని అప్‌లోడ్‌ చేయడం, దరఖాస్తు స్థితిని తనిఖీ చేయడం కోసం సవరణ లింక్‌కు సంబంధించి ఒక సర్క్యూలర్‌ను జారీ చేసింది. రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డుల (ఆర్‌ఆర్‌బీ) అన్ని అధికారికి వెబ్‌సైట్స్‌లో డిసెంబర్‌ 15 నుంచి సవరణ లింక్‌ అందుబాటులోకి వస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement