Monday, April 29, 2024

సింధుని సత్కరించిన శివారెడ్డి..

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధును సినీ నటుడు..మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి సత్కరించారు. ఆదివారం ఆమె నివాసానికి వెళ్లి వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించటం గర్వకారణమని అభినందించారు. రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలను సాధించాలని ఆకాంక్షించారు. ఆమె పతకం సాధించిన సందర్భంలోని ఫొటోను సింధుకు బహూకరించారు శివారెడ్డి. తన కామెడీ ఎంతో బాగుంటుందని సింధుతో పాటు ఆమె కుటుంబ సభ్యులు తనను అభినందించారని శివారెడ్డి చెప్పుకొచ్చారు. కాగా టోక్యో-2020 ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్‌ విభాగంలో కాంస్య పతకం సాధించిన సింధు అంతకముందు 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన అనంతరం ఇప్పుడు మూడో స్థానంతో మరో పతకాన్ని సొంతం చేసుకొని వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ ఈ  ఘట్టాన్ని ఆవిష్కరించిన రెండో భారత ప్లేయర్‌గా, తొలి మహిళగా నిలిచింది.  

ఇది కూడా చదవండి: వైఎస్ షర్మిల కొత్త నినాదం.. జల్, జమీన్, జంగల్

Advertisement

తాజా వార్తలు

Advertisement