Friday, May 10, 2024

టీఎంసీలోకి శతృఘ్న సిన్హా..?

కాంగ్రెస్ సీనియర్ నేత శతృఘ్న సిన్హా టీఎంసీ గూటికి చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 21న ఇందుకు ముహూర్తం కూడా ఖరారైందని సమాచారం. త్వరలోనే ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీతో భేటీ అవుతారని కూడా తెలుస్తోంది. శతృఘ్న సిన్హా ఇటీవల బీజేపీకి అనుకూలంగా ట్వీట్ చేయడంతో ‘ఘర్ వాపసీ’ ఉంటుందని అందరూ భావించారు. అయితే, టీఎంసీతో ఇటీవల ఆయనకు సాన్నిహిత్యం పెరగడంతో అటువైపు మొగ్గుచూపుతున్నారు. 2024 సాధారణ ఎన్నికల నాటికి మోదీకి గట్టి పోటీ ఇచ్చే నేతగా మమత ఎదుగుతారని భావిస్తుండడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ విషయంలో చర్చలు చివరి దశలో ఉన్నట్టు టీఎంసీ నేతలు పేర్కొన్నారు.


ఇది కూడా చదవండి: RRR నుంచి కీలక అప్‌డేట్.. ఈనెల 15న ‘రోర్ ఆఫ్ RRR’

Advertisement

తాజా వార్తలు

Advertisement