హీరో శర్వానంద్ పంథా మార్చారు. తన పుట్టినరోజు సందర్భంగా ప్రకటించిన 35వ చిత్రం ఒక యూనిక్ పాయింట్తో ఉండబోతోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీ-జీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కొనసాగు తోంది. పోస్టర్ లో లండన్ను లొకేషన్ గా సూచిస్తున్నాయి. సినిమాలో శర్వానంద్ క్యారెక్టర్ ఎంత క్రేజీగా ఉండబోతుందో పోస్టర్ స్పష్టం చేస్తోంది. ఈ చిత్రానికి మలయాళ కంపోజర్ ‘హృదయం’ ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. ఛాయాగ్రహణం విష్ణు శర్మ, ఎడిటర్ ప్రవీణ్ పూడి ఇతర వివరాలను చిత్ర బృందం త్వరలో తెలియజేస్తారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement