Saturday, April 27, 2024

ఆయుష్మాన్ భారత్ లో తిరకాసు ఉంది: ష‌ర్మిల‌

కేంద్ర ప్ర‌భుత్వ ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కంలో ఇటీవ‌లే తెలంగాణ ప్ర‌భుత్వం చేరిన విష‌యం తెలిసిందే. దీనిపై వైఎస్ షర్మిల స్పందించారు. పేదలను గుర్తించటంలో ఆయుష్మాన్ భారత్ లో తిరకాసులు ఉన్నాయ‌ని ఆమె అన్నారు. ఆయుష్మాన్ భారత్‌, ఆరోగ్య శ్రీ ప‌థ‌కాల‌కు సంబంధించిన ఓ గ్రాఫ్‌ను ఆమె ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. 80 లక్షల కుటుంబాలు ఆరోగ్యశ్రీ నుంచి ల‌బ్ధి పొందుతున్నాయి. కానీ ఆయుష్మాన్ భారత్ వలన లబ్ధిపొందేది కేవలం 26 లక్షల కుటుంబాలు మాత్రమే. పేదలను  గుర్తించటంలో తిరకాసులు  ఉన్న ఆయుష్మాన్ భారత్..  పేదలందరికి కరోనా వైద్యం అందించలేదు. ఇక కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నాం’ అని ష‌ర్మిల పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement