Thursday, March 28, 2024

పరమ మైత్రికి ప్రతీక కుచేలోపాఖ్యానం

శ్రీకృష్ణ పరమాత్మ ఒకనాడు రుక్మిణీదేవి మందిరంలో కూర్చుని ఉన్నాడు. ఎంతో సంతోషంగా రోజులు గడిచిపోతున్నాయి. కానీ శ్రీకృష్ణ భగవానుడితో చదు వు కున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు కుచేలుడు. కటిక దారి ద్య్రం తో బాధపడేవాడు. సంప్రదాయంలో కుచేలుని గురించి ఒక తప్పు కథ ప్రచా రంలో ఉంది. అది ఎలా వచ్చిందో తెలియదు. కృ ష్ణుడికి తెలియకుండా ఒక రోజున అరణ్యంలో కుచేలుడు అటు కులు తి న్నాడని, అందుకే అంత దరిద్రం అనుభవించాడని, ఆ తరువాత శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకు ఐశ్వర్యం ఇచ్చాడని అంటారు.
కానీ భాగవతంలో కుచేలుని గురించి అలా చెప్పలేదు. కుచేలుని గురించి వ్యాసులవారు, పోతనగారు చాలా గొప్పగా వివరించారు. వేదవ్యాస కుమారుడయిన శుకుడు అభిమన్యుని కుమారుడయిన పరీక్షిత్తును చూసి ”ఓ రాజా! ఆ కుచేలుడు ఎటువంటి వాడో నీకు చెపుతాను విను” అని చెప్పిన ఘట్ట్టం పరిశీలిస్తే తెలుస్తుంది.
కుచేలుడు అపారమయిన మానాభిమానములు కలిగిన వాడు. యాచన చేయడానికి సిగ్గు విడిచిపెట్టాలి.
కానీ కుచేలుడు అలా సిగ్గు విడిచి పెట్టిన వాడు కాదు. గొప్ప బ్రా#హ్మణ తేజస్సు ఉన్న వాడు. విజ్ఞాని.
ఆయన అనుబంధములకు అతీతంగా ఉంటూ నిరంతరమూ బ్ర#హ్మమునందు రమించే మనస్సు ఉన్నవాడు.
లోకమునందు ఈశ్వరుని దర్శనము చేయగలిగిన సమర్థుడు. ఆ మహానుభావుడికి ధర్మం అంటే మహాయిష్టం.
విశేషించి ఆయన గొప్ప బ్రహ్మజ్ఞాని. తనకు ఏమీలేకపో యినా దరిద్రంలో అన్నీ ఉన్నాయని తృప్తిగా ఉన్నవాడు.
ఈశ్వరుడు తనకు ఫలానిది ఇవ్వలేదు అని అనడం తెలియనివాడు. అంతటి మహాభక్తుడు. గోవింద సఖుడు.
అటువంటి కుచేలుడు అంత దరిద్రం అనుభవిస్తున్నా ఎన్నడూ కృష్ణ భగవానుడి దగ్గరకు వెళ్లి చెయ్యి చాపి ”కృష్ణా, నాకు సహాయం చేస్తావా?” అని అడగలేదు.
కుచేలుని భార్య అనురక్త. కుచేలుడు ఎలా ప్రవర్తిస్తాడో తాను కూడా అలా ప్రవర్తించే సహధర్మచారిణి. గొప్ప భాగవత ధర్మమూ తెలిసి ఉన్న తల్లి. ఆవిడ ఒక రోజున భర్తతో అంది ”మహానుభావా! ఆకలి వేస్తే మీరు ఓర్చుకుంటారు. నేను ఓర్చు కుంటాను. పిల్లలు ఆకులతో చేసిన డొప్పలు చేత పట్టుకుని పది మాట్లు ఆకలేస్తోంది అమ్మా అని అంటే అన్నం పెట్టలేక పోయానే అని నేను బాధపడతానే మానని ఆకలితో నావంక చూస్తూ నాలుకతో పెదవులు తడుపుకుంటున్నారు. నీకు ఐశ్వర్యం భ్రాంతి లేదు. కానీ బిడ్డలను పోషించాలి కదా.
కాబట్టి మీరు పాటిస్తానంటే ఒక సలహా చెప్తాను. మీ సఖుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు కదా. మీరు ఒకసారి ఆయన వద్దకు వెళ్లి ఒక్కమాట చెప్పినట్లయితే అందరినీ ఆదుకోగలిగిన మహానుభావుడు ఆ వాసుదేవుడు మనలను ఆదుకుంటాడు. ఆయనను భక్తితో ఏమి అడిగినా యిస్తాడు. ఎందుకు వచ్చిన దరిద్రం మనకి. పిల్లల కోసమయినా ఆయన దగ్గరకు ఒక్కసారి వెళ్ళవలసింది’ అని చెప్పింది.
భార్య అలా చెప్పేసరికి ఆయన ”పెద్దవాళ్ళ దగ్గరకు వెళ్ళేటప్పుడు, స్నే#హతుని దగ్గరకు వెళ్ళేటప్పుడు, రోగుల దగ్గరకు వెళ్ళేటప్పుడు, వృద్ధుల దగ్గరకు వెళ్ళేటప్పుడు, గురువుల దగ్గరకు వెళ్ళేటప్పుడు, రిక్త#హస్తాలతో వెళ్ళలేము కదా! స్నే#హతుడికి ఏదయినా కానుక పట్టుకెళ్ళాలి కదా! ఆయనకు ఇవ్వడానికి మనింట్లో ఏమి కానుక ఉంది?” అని అడిగాడు. ”మనకి ఉన్నదే యిద్దాము. మన యింట్లో గుప్పెడు అటుకులు ఉన్నాయి. అవి మూట కట్టి యిస్తాను తీసుకువెళ్ళండి’ అన్నది. కుచేలుని బార్య అటుకులను చిరిగిపోయిన ఉత్తరీయంలో పోసి జాగ్రత్తగా ముడి వేసి కుచేలునికి ఇచ్చింది. దానిని తీసుకుని కుచేలుడు కృష్ణుని వద్దకు బయలుదేరాడు. కుచేలుడు చిరిగిపో యిన బట్టలతో చెమట కంపుతో, రథములనుండి వస్తున్న ధూళి అంతా వంటిమీద పడిపోయి దుర్వాసన వచ్చే స్థితిలో నడిచి నడి చి, చివరకు ద్వారకా నగరం చేరుకున్నాడు. ఏమి తిన్నాడో, ఏమి తినలేదో ఈశ్వరునికి ఎరుక. ద్వారకా పట్టణ సౌందర్యం చూసి ఆశ్చర్యపో యాడు. తన సఖుడ యిన గోవిందు డు ఎక్కడ ఉన్నాడోనని వాకబు చేసి కృష్ణ భగవానుడు ఉన్న భవనాన్ని తెలుసుకున్నాడు.
ఇంటి ముందర పెద్ద పెద్ద శూలములు పట్టుకొని భటులు కాపలా కాస్తున్నారు. తన స్థితిని చూసి లోపలికి రానిస్తారో రాని వ్వరో, కృష్ణుడు తనని గుర్తు పడతాడో పట్టడో అనుకున్నాడు. రాజ భటులకు ఏదైనా కానుక యిచ్చి లోపలికి వెళదాము అంటే తన దగ్గర కృష్ణునికి ఇవ్వడానికి తెచ్చిన అటుకులు తప్ప వేరొకటి లేదు.
కాబట్టి ఇపుడు వాసుదేవుడిని చేరడానికి తనకు వాసుదేవుడే ఆధారం అని అనుకుని సౌధం దగ్గరికి వెళ్లి తెరతీసి భటులను చూశాడు. భటులు ”ఎవరు కావాలి?” అని అడిగారు. నేను కృష్ణ పరమాత్మ స్నే#హతుడిని అని చెప్పాడు. అపుడు వాళ్ళు ఆయనను ఎగాదిగా చూశారు. పాపం ఆయన చాలా దయనీయమయిన స్థితిలో కనపడ్డాడు. కానీ ద్వారకానగరంలో ఉన్న కృష్ణ పరమాత్మ ఎటువంటి వాడో అక్కడ వున్న ద్వారపాలకులకు తెలుసు. అందుకని వారు వెళ్లి కృష్ణ పరమాత్మతో ”అయ్యా మీకోసమని చాలా పేద బ్రా#హ్మణుడు, మీ స్నే#హతుడనని చెప్పి కలుసుకునేందుకు ద్వారం దగ్గర నిరీక్షిస్తున్నాడు” అని చెప్పారు.
అప్పుడు కృష్ణ పరమాత్మ రుక్మిణీ దేవి మందిరంలో అమ్మవారితో హాస్యోక్తులాడుతూ ఉన్నాడు. తెర తీసేసరికి దూరంగా రాజద్వారం దగ్గర నిలబడి ఉన్న కుచేలుడు కనిపించాడు. కుచేలుని అంతదూరంలో చూసి ”కుచేలా ఎప్పుడు వచ్చావు”? అని పలకరిస్తూ, ఒక్కసారి మంచం మీద నుంచి దిగి పరుగెత్తుకుంటూ వెళ్లి కుచేలుడిని గట్టిగా కౌగలించుకున్నాడు. ”కుచేలా ఎన్నాళ్ళకు చూశానయ్యా నిన్ను. లోపలికి రావలసింది
అని కుచేలుని చేయి పట్టుకుని గబగబా లోపలికి తిన్నగా తన శయన మందిరంలోకి తీసుకువచ్చాడు. అక్కడ ఒక పాన్పు ఉంది. రుక్మిణీ దేవి, తానూ తప్ప అన్యులు ఆ పాన్పును ముట్టరు. అటువంటి #హంస తూలికా తల్పం మీద కుచేలుని కూర్చోబెట్టాడు. రుక్మిణీదేవిని పిలిచి బంగారు చెంబుతో నీళ్ళు తెప్పించి ఆయన కాళ్ళకింద పళ్ళెం వుంచి ఆదిలక్ష్మియైన రుక్మిణీదేవి నీళ్ళు పోస్తుండగా కృష్ణ పరమాత్మ కుచేలుని కాళ్ళు కడిగాడు. ఏ తల్లి కనుచివరి చూపు తగిలితే ఐశ్వర్యం వస్తుందని లోకం కొలుస్తుందో ఆ లక్ష్మీదేవి నీళ్ళు పోస్తుండగా, సమస్త బ్రహ్మాండములకు ఆధారభూతమయిన కృష్ణ పరమాత్మ కాళ్ళు కడుగుతున్నాడు.
శిరస్సు వంచి ఆ నీళ్ళు తన శిరస్సు మీద కిరీటం మీద చల్లు కున్నాడు. రుక్మిణీదేవి తలమీద చల్లాడు.
అక్కడ ఉన్న వాళ్ళందరి మీద చల్లాడు. ఎంతో దూరం నుంచి నడిచి వచ్చి అలసిపోయాడని కుచేలుని ఒంటినిండా గంధం రాశాడు. ఒక విసనకర్ర పట్టుకొని విసురుతున్నాడు.
కృష్ణ పరమాత్మ చేసిన హడావుడికి రుక్మిణీ దేవి తెల్లబోయింది. ఆమె కూడా తామరపువ్వులతో చేసిన విసనకర్రను తెచ్చి కుచేలునికి విసురుతున్నది. ఆ గాలి ఒంటికి తగిలి ఆయన సేదతీరాడు. మంచి ధూపమును ఆయనకు చూపించాడు. మణులతో కూడిన దీపములతో ఆయనకు నీరాజనం యిచ్చాడు.
తరువాత ఎంతో సంతోషంగా కుచేలునికి దగ్గరగా కూర్చున్నాడు. పరమ ఆప్యాయంగా కుచేలుని చేతులు తన చేతులలో పెట్టుకుని స్నేహతుని వంక చూసి యోగక్షేమములు అడిగాడు. కృష్ణ పరమాత్మ అలా ప్రవర్తించడం ఇంతకు పూర్వం ఎవరూ చూడలేదు.
ఏమి తపంబు సేసెనొకొ!
యీ ధరణీద్విజోత్తముండు తొల్‌ బామున!
యోగివిస్ఫుర దుపాస్యకుడ్కె తనరారు నీ జగత్స్వామి రమాధినాథు నిజతల్పమునన్‌ వసియించి యున్నవాడీ మ#హనీయమూర్తి కెనయే మునిపుంగవు లెంతవారలున్‌?
ఏమి ఆశ్చర్యము!
ఇంతకు పూర్వం నారదుడు వచ్చినప్పుడు చూశాము, ఎందరో మ#హర్షులు వచ్చినప్పుడు చూశాము.
అందరినీ దర్బారు హాలులో కూర్చోబెట్టి మాట్లాడేవాడు. అంతేకానీ ఈ బ్రా#హ్మణుడు చూస్తే దరిద్రుడిలా ఉన్నాడు. ఏమి తపస్సు చేశాడో! మహా యోగులైన వారు తపస్సు చేస్తే తప్ప దొర కని పరమాత్మ ఈవేళ ఈ బ్రా#హ్మణునకు ఎంత సేవ చేశాడు. ఆ త ల్పం మీద రుక్మిణీ కృష్ణులు తప్ప అన్యులు కూర్చోవడం మనం యింతవరకు చూడలేదు. ఈ బ్రా#హ్మణుడుదానిమీద కూర్చో వ డమా! అసలు ఈయన ఎవరు? అని వాళ్ళు ఆశ్చర్య పోతున్నారు.
అపుడు కృష్ణ పరమాత్మ కుచేలునితో ”ఓ బ్రా#హ్మణోత్తమా! నీవు వివా#హం చేసుకున్న స్త్రీ వేదాన్నినమ్ముకున్న, వేదపాఠం చెప్పుకున్న బ్రా#హ్మణుల కుటుంబంలో జన్మించిన పిల్ల అని నేను విన్నాను. అట్టి కుటుంబంలో పుట్టిన పిల్ల భర్తను అనుసరించి సుశీలయై ఉంటుంది. నిన్ను చూస్తుంటే నీ మనస్సు భార్యయందు
బిడ్డలయందు భ్రాంతి లేకుండా కేవలం సంసారంలో ఉండాలి కాబట్టి మాత్రమే ఉండి వి#హత కర్మాచరణముగా భార్యాబిడ్డలను చూడాలి కాబట్టి చూస్తూ సంతతము బ్ర#హ్మమునందు రమిస్తున్న వాడిలా నాకు కనపడుతున్నావు. అవునా?” అని అడిగాడు.పిమ్మట ఇద్దరూ కలిసి భోజనం చేశారు.
భోజనానంతరం మరల ఇద్దరూ వచ్చి కూర్చున్న పిమ్మట కృష్ణుడు కర్పూర తాంబూలమును తానే స్వయంగా చేసి తెచ్చి వేసుకోమని కుచేలునికి ఇచ్చాడు. ఆ రోజున కృష్ణుడు పూర్తిగా కుచేలునితోనే గడిపాడు. ఆయన తాను కుచేలునితో గడిపిన చిన్ననాటి ముచ్చట్లను తలుచుకున్నాడు. కృష్ణుడు చూపిస్తున్న ఈ ప్రేమను కుచేలుడు జీర్ణం చేసుకోలేక పోతున్నాడు. కుచేలా ఎవరి దగ్గరికయినా వెడితే ఏమయినా పట్టుకు వెళ్ళాలని మన గురువుగారు సాందీపని అంటూ ఉండేవారు కదా! మరి నువ్వు నాకు ఏమి తెచ్చావు?” అని గబగబా కుచేలుడిని తడిమేస్తున్నాడు. కుచేలుడు సిగ్గు పడిపోయాడు.
ఆయన లక్ష్మీనాథుడు. గొప్ప ఐశ్వర్యవంతుడు. ఆయనకు తాను ఏమి యిస్తాడు? చిరిగిపోయిన ఉత్తరీయానికి మూట కట్టి ఉన్న అటుకులను చూశాడు. కుచేలా, చాలా ఐశ్వర్య వంతుడనని నాకు చాలామంది కానుకలు పట్టుకువచ్చి ఇస్తుంటారు. అవి వాళ్ళందరూ నాయందు ప్రీతితో నేనే తినాలని తెచ్చినవి కావు. తమకు ఉన్నాయని ఆడంబరమునకు తెచ్చి యిచ్చిన వాళ్ళు ఉన్నారు. వాటిని నేను ముట్టుకోను. ఒక ఆకు కాని, పువ్వు గాని, పండు గాని, కొబ్బరి నీళ్ళను గాని, ఎవరయినా భక్తితో తెచ్చి యిస్తే వాటిని నేను పుచ్చుకుంటాను.
భక్తితో తెచ్చిన వాటికి పెద్ద పీట వేస్తాను. ఆడంబరమునకు తెచ్చిన వాటిని పక్కన పెట్టేస్తాను. అని కుచేలుని వద్ద ఉన్న అటుకుల మూటను తీసుకొని విప్పి పిడికెడు అటుకులు తీసుకుని నోట్లో పోసుకున్నాడు.
అలా పోసుకునే సరికి 14 భువనభాండములలో వున్న సమస్త జీవరాసుల కడుపునిండి బ్రేవుమని త్రేన్చాయి. కృష్ణుడికి యింకా ప్రీతి ఆగక మరియొక పిడికెడు తీసి పోసుకుంటున్నాడు. రుక్మిణీదేవి చూసింది.వెంటనే వచ్చి కృష్ణ పరమాత్మ చేయి పట్టుకుని, ”మీరు తిన్నది చాలు. ఇ#హ లోక మందు పదితర ములు తినడానికి కావలసి న ఐశ్వర్యము, భక్తి, జ్ఞానము, మోక్షము అన్నీ కుచేలునికి ఇచ్చేశారు. ఇంకొక పిడికెడు నోట్లో పోసు కుంటే నన్ను మి మ్ములను కూడా కుచేలునికి దాసు లుగా ఇచ్చే స్తారు. ఇంక చాలు’ అంది. ఆ తల్లికి అన్నీ తెలుసు.

కైలాస్‌ నాగేష్‌
(హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ పిఎస్‌)
98490 52956

Advertisement

తాజా వార్తలు

Advertisement