చిన్న, మధ్య తరహా సంస్థలకు వినూత్న ఆర్థిక సేవలు అందించే హైదరాబాద్ ఫిన్టెక్ కంపెనీ జిక్జుక్ టెక్నాలజీస్ మరో ఘనత సాధించింది. శాండ్ బ్యాక్స్ స్కీమ్ పేరుతో ఆర్బీఐ నిర్వహించే ప్రయోగాత్మక సేవల పరీక్షలకు ఎంపికైంది. ఈ పథకం కింద 22 కంపెనీల నుంచి ఆర్బీఐకి దరఖాస్తులు అందాయి. జిక్జుక్, సిడ్నీతో పాటు మరో 6 కంపెనీలకు ఇందుకు ఎంపిక చేశారు.
ఈ కంపెనీలు ఆర్బీఐ పర్యవేక్షణలో ఖాతాదారులకు ప్రయోగాత్మకంగా తమ వినూత్న ఆర్థిక సేవ లను ఎస్ంఈలు, ఎంఎస్ఎంలకు అందించి తమ సామర్ధ్యాన్ని నిరూపించు కోవాల్సి ఉంటుంది
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.