Thursday, May 9, 2024

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో రూ.14కోట్ల‌ డ్రగ్స్‌ పట్టివేత

ఢిల్లీ నగర ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ త‌నిఖీల్లో మరోసారి భారీగా డ్రగ్స్‌ పట్టుబడింది. ఉగాండాకు చెందిన ఓ మహిళ దుబాయ్ నుండి ఢిల్లీ చేరుకుంది. అయితే ఈ లేడీ కిలాడి ప్రొఫైల్ పై అనుమానం కలగడంతో కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.రూ.14కోట్ల విలువైన 2 కిలోల హెరాయిన్ సీజ్ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ఉగాండా దేశస్తురాలును అధికారులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే స్కానింగ్ కు చిక్కకుండా డ్రగ్స్ ను ట్రాలీ బ్యాగ్ నాలుగు పక్కల దాచి కర్బన్ పేపర్ చుట్టింద‌ని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement