Thursday, April 25, 2024

‘స‌ర్కారు వారి పాట’ న్యూ రిలీజ్ డేట్..

సంక్రాంతి బ‌రిలో నిలుస్తుంద‌నుకున్న స‌ర్కార్ వారి పాట చిత్రం వాయిదా ప‌డింది. టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు హీరోగా న‌టించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది అంటే..ఉగాది కానుకగా ఏప్రిల్‌ 1 వ తేదీన సర్కారు వారి పాట సినిమాను విడుదల చేయనున్నట్లు అఫిషీయల్‌ గా ప్రకటించింది చిత్ర యూనిట్‌. ఈ మేరకు ఓ పోస్టర్‌ కూడా రిలీజ్ చేశారు. కాగా.. గతంలో సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. సంక్రాంతికి వరుసగా సినిమా ఉండటంతో.. ఏప్రిల్‌ కి షిఫ్ట్‌ అయింది. స్టార్‌ డైరెక్టర్‌ పరుశురాం ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. పొలిటికల్ అండ్ మాస్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు… కీర్తిసురేష్ నటిస్తోంది. ఈ సినిమా కు నవీన్ ఎర్నేని, వై రవి శంకర్ మరియు గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement