Saturday, April 27, 2024

ఆర్సీబీ మహిళల జట్టు మెంటార్‌గా సానియా

ఆర్సీబీ జట్టులోకి హైదరాబాద్‌ టెన్నిస్‌ స్టార్‌ సానియా మిర్జా వచ్చి చేరింది. అదేమిటి ఆమె టెన్నిస్‌ క్రీడాకారిణి.
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూరు(ఆర్‌ సీబీ) ఒక్క ఐపీఎల్‌ ట్రోఫీని గెలవ లేకపోయినా ఈ జట్టుకు ఎంతో క్రేజ్‌ ఉంది. అందుకు కారణం ఆ జట్టు ఆటగాళ్లే… విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌, క్రిస్‌ గేల్‌ , గ్లెన్‌ మ్యాక్స్‌ వెల్‌ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది స్టార్‌ ప్లేయర్లు ఈ జట్టుకు ప్రాతినిద్యం వహించారు.

క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహిళల ప్రీమియర్‌ లీగ్‌ త్వరలోనే ఆరంభం కానుంది. ఈ లీగ్‌లో భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మిర్జా ప్రత్యేక పాత్ర పోషించనున్నారు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూరు టీమ్‌కు ఆమె మెంటార్‌గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని ఆర్సీబీ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించింది. ‘ఆర్సీబీ మహిళా జట్టు మెంటార్‌గా సానియా మిర్జాను స్వాగతించడం మాకు సంతోషంగా, గౌరవంగా ఉంది’ అంటూ ట్వీట్‌ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement