Monday, May 6, 2024

శ్రీవారి సేవలో అక్కినేని కోడలు

టాలీవుడ్ హీరోయిన్, అక్కినేని సమంత శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలకు చేరుకున్న సమంత వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్నారు. మహాన్యాస ఏకాదశి రుద్రాభిషేకంలో పాల్గొన్న సమంత అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. వేదపండితులు ఆమెను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాగా, సమంత నటించిన ‘శాకుంతలం’ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. అలాగే, తమిళంలో విజయ్ సేతుపతితో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement