Wednesday, April 24, 2024

అది విమోచనమా ? లేక విలీనమా?: ఆ రెండు పార్టీలకు రాములమ్మ ప్రశ్న

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారింకగా నిర్వహించకపోవడంపై బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణకు విముక్తినిచ్చిన సెప్టెంబర్ 17వ తేదీని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నిర్వహించిన తీరుపై విమర్శలు గుప్పించారు. తెలంగాణకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అందించిన విమోచనోత్సవంగా కాకుండా కేవలం భారతదేశంలో నిజాం సంస్థానం (తెలంగాణ) విలీనం చేసినట్లు భావిస్తూ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు విలీనోత్సవం నిర్వహించాయన్నారు. స్వాతంత్ర్యం అంటే రాక్షస రజాకార్ల అధికార నియంతృత్వం నుండి విమోచనమా.? లేక కేవలం భారతదేశంలో విలీనమా? అని ప్రశ్నించారు. ఎన్ని మాటలు తిప్పి చెప్పినా… దుష్టుల దుర్మార్గాల నుండి బయటపడితే విమోచనమే అంటారని అన్నారు.

‘’ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌ని అల్లకల్లోలం చేస్తున్న తాలిబన్ పాలన నుండి ఆఫ్ఘన్ ప్రజలు పోరాడి విముక్తులైతే అది విమోచనమౌతుందా?… కాదా?… లేదూ పాకిస్తాన్ లాంటి దేశాల దుష్ప్రచారం ప్రకారం విద్రోహమౌతుందా…? విచిత్రం ఏమిటంటే… విలీనోత్సవం అంటూ పార్టీ కార్యక్రమంగా మాత్రమే దీనిని నిర్వహిస్తున్న అధికార పార్టీ వారికి… ప్రభుత్వం తరఫున అధికారికంగా ఈ విమోచనోత్సవాన్ని నిర్వహించడానికి మాత్రం ధైర్యం చాలకపోవడం. మతవాద MIM, దాని సయామి ట్విన్ TRS… ఆ ఇద్దరికి విధాన సమర్ధన ఇస్తున్న తెలంగాణ కాంగ్రెస్ తెల్చాలి. ప్రజావ్యతిరేక పాలన… రజాకార్ల అరాచకాల నుంచి విముక్తి పొందినందుకు సెప్టెంబర్ 17వ తేదీని కాస్త తెలివి ఉన్నవారెవరైనా విమోచనదినంగానే పాటిస్తారు’’ అని రాములమ్మ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండిః మజ్లిస్ ను ఓడిస్తేనే తెలంగాణకు నిజమైన స్వేచ్ఛ

Advertisement

తాజా వార్తలు

Advertisement