Monday, April 29, 2024

సాలార్‌జంగ్‌ మ్యూజియం రూపకర్త కన్నుమూత…

హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్‌ మ్యూజియం రూపకర్త ప్రముఖ స్ట్రక్చరల్‌ ఇంజినీర్‌ మహేంద్ర రాజ్‌(97) కన్నుమూశారు. ఢిల్లిలోని ఆయన నివాసంలో ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. సాలార్‌జంగ్‌ మ్యూజియంతోపాటు, ఢిల్లిలోని ప్రగతి మైదాన్‌, అహ్మదాబాద్‌లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ వంటి భవనాలకు మహేంద్ర రాజ్‌ రూపకల్పన చేశారు. మహేంద్రరాజ్‌ మృతి పట్ల రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోడీ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement