Wednesday, April 24, 2024

ఢిల్లీలో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. తప్పించుకున్న దుండగులు..

దేశ రాజధాని ఢిల్లీలో అందరూ చూస్తుండగానే ముగ్గురు దుండగులు కాల్పులు జరపడం కలకలం రేపింది. శనివారం రాత్రి సుభాష్‌నగర్‌ ప్రాంతంలో ఇద్దరు సోదరులు కారులో వెళ్తుండగా కొందరు దుండగులు తుపాకులతో కాల్పులు జరిపారు. తప్పించుకునేందుకు కారును వేగంగా నడిపేందుకు యత్నించారు. అయినా వాహనాన్ని వెంబడించి కాల్పులు జరిపారు. ఆ తర్వాత అటు నుంచి దుండగులు పారిపోయారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

కాల్పుల దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు దుండగులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. పాతకక్షలతోనే కాల్పులు జరిపినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement