Saturday, April 27, 2024

Sabarimala: నేటి నుంచి శబరిమల ఆలయం మూసివేత.. ముగిసిన దర్శనాలు

నేటి నుంచి శబరిమల ఆలయం మూసివేయ‌నున్నారు. స్వామివారి ద‌ర్శ‌నాలు ముగియ‌డంతో ప్రత్యేక పూజలతో ఆలయంను మూసివేశారు. ఈ ఏడు అయ్యప్పస్వామిని 50 లక్షల మంది భక్తులుదర్శించుకున్నారు.

ఈ ఏడాది శబరిమల అయ్యప్ప ఆలయానికి 357 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం ప్రకటించింది. కాగా, నవంబరు, డిసెంబరు నెలలలో శబరిమల భక్తులతో కిటికటలాడింది. దర్శనానికి 24 గంటల సమయం కూడా పట్టిన రోజులున్నాయి. రహదారులపై అనేక చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. చివరకు కేరళ హైకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. శబరిమలలో అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినా సరైన వసతులు సమకూర్చలేదని అనేక మంది దేవస్థానం కమిటీపై మండిపడ్డారు. దీంతో వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి కపనులను చేపడతామని ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement