Friday, April 26, 2024

క‌లెక్ష‌న్స్ తో దూసుకుపోతోన్న‌.. వాల్తేరు వీర‌య్య

క‌లెక్ష‌న్స్ తో దూసుకుపోతోంది వాల్తేరు వీర‌య్య చిత్రం. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ల తర్వాత చేసిన మాస్ ఎంటర్ టైనర్ చిత్రం ఇది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లోనూ సినిమా సత్తా చాటుతోంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని యువ దర్శకుడు బాబీ తెరకెక్కించిన తీరు అబిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దాంతో, చిత్రం భారీ వసూళ్లు రాబడుతోంది. ఆరు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 157.15 కోట్ల గ్రాస్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో 121.35 కోట్లు వచ్చాయి. అమెరికాలోనూ ఈ చిత్రం ప్రభంజనం సృష్టిస్తోంది. యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ల (రూ.16 కోట్లు) మార్కెట్ అందుకుంది. ఈ ఏడాది ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement