Wednesday, April 24, 2024

స్వయంభూ శంభు లింగేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్న ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా

సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గం కొండపాక మండల పరిధిలోని దుద్దేడ గ్రామంలో స్వయంభు శంభూ లింగేశ్వర స్వామి దేవాలయంలో శివపార్వతుల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి వారి దేవాలయంలో దేవుని వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన శివపార్వతుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా విచ్చేసి, స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో నంది విగ్రహానికి వెండి తొడుగు చేపిస్తానని ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో.. ఆలయ ఛైర్మన్ గొల్లపల్లి రామ్ చందర్ మూర్తి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్, సర్పంచ్ ఆరపల్లి మహదేవ్ గౌడ్, ఆలయ కార్యదర్శి మంచాల శ్రీనివాస్, ఉప్పల రాజేందర్, బాలాజీ, మాజీ మార్కెట్‌ చైర్మన్‌ మంచాల శ్రీనివాస్‌, ట్రస్ట్ సభ్యులు, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు ప్రసాద్ వెంకట్ రమణ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement