Thursday, May 2, 2024

వ‌చ్చే ఎన్నిక‌ల కోసం ఒక్కొక్క ఎమ్మెల్యేకు రూ.30కోట్లు-వైసీపీ స‌ర్కార్ ప్లాన్ ఇదే-విష్ణుకుమార్ రాజు

రాబోయే ఎన్నిక‌ల్లో నిధుల‌ను పారించి ఎలాగ‌యినా విజ‌యాన్ని సాధించే దిశ‌గా అడుగులు వేస్తోంది వైసీపీ ప్ర‌భుత్వం.ఈ నేప‌థ్యంలో ఒక్కొక్క ఎమ్మెల్యేకు సుమారు రూ. 30 కోట్ల చొప్పున ఇచ్చేందుకు పార్టీ ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇదే విషయంపై .. బీజేపీ మాజీ ఎమ్మెల్యే.. విష్ణు కుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒక్కొక్క ఎమ్మెల్యేకు రూ.30 కోట్ల చొప్పున ఇచ్చి గెలిపించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు.

దీనిని బట్టి.. ఏపీలో వచ్చే ఎన్నికల్లోనూ.. ధన ప్రవాహం ఆగబోదని ఆయన విమర్శించారు. గెలుపు గుర్రం ఎక్కడమే లక్ష్యంగా వైసీపీ సర్కారుపాలన ఉందని ఆరోపించారు. ప్రజలు ఇప్పటికైనా.. తెలుసుకోవాలని..విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. ఏపీలో ఓట్ల రాజకీయం కూడా తెరమీదికి వచ్చింది. ఇప్పటివరకు ఉన్న ఓట్లలో.. తమకు అనుకూలంగా లేనివారి ఓట్లను తొలగించేందుకు అధికార పార్టీ పెద్దలు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇదే… విషయాన్ని బీజేపీ ఎంపీ.. జీవీఎల్ నరసింహారావు తేల్చిచెప్పారు.పెద్ద సంఖ్యలో ఓటర్లను రద్దు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆంధ్రేతర ప్రాంతానికి చెందిన ఓటర్లను కావాలని జాబితా లోంచి తొలగించారని ఎలక్షన్ కమిషన్ కు లేఖరాశామన్నారు. ఒక్క విశాఖపట్నంలోనే సుమారు 50 వేలకు తక్కువ కాకుండా ఓట్లు గల్లంతు చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఇతర నగరాల్లో పరిస్థితి ఏంటో త్వరలోనే తేలుస్తామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement