Thursday, April 25, 2024

క‌ర్నూల్ లో కార్తికేయ‌2 సెల‌బ్రేష‌న్ – వంద కోట్ల క్ల‌బ్ లో నిఖిల్ మూవీ

కార్తికేయ‌2 చిత్రం సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. ఈ చిత్రంలో హీరోగా నిఖిల్..హీరోయిన్ గా అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టించారు. కాగా చందూ మొండేటి దర్శకత్వం వహించారు.. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ లోను ఈ సినిమాకి మంచి ఆదరణ లభించింది. ఇక ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. దాంతో అందుకు సంబంధించిన సెలబ్రేషన్స్ ను నిర్వహించడానికి టీమ్ రెడీ అవుతోంది. ఆగ‌స్టు 26 సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుక మొదలవుతుందని చెబుతూ, అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను వదిలారు. హిందీలో తొలి రోజున 50 థియేటర్లలోనే విడుదలైన ఈ సినిమా, 3వ రోజు నాటికి 700 థియేటర్లకు వెళ్లింది. ఇక ‘శ్రీకృష్ణ జన్మాష్టమి’ రోజున ఈ సినిమా వసూళ్లు అనూహ్యంగా పెరిగిపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement