Saturday, May 4, 2024

RR vs MI | జైస్వాల్ మెరుపు శ‌త‌కం.. ముంబైపై రాజస్థాన్ ఘన విజయం

ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. నేడు జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో మరో విజయం సాధించింది. హోం గ్రౌండ్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో తలపడిన రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్ ఈ విజయంతో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై రాజస్థాన్ బౌలర్ల ధాటికి 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఆ తర్వాత 180 పరుగుల ఛేదనలో రాజస్థాన్ ఓపెనర్లు ఛేజింగ్‌లో విజృంభించారు. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఫామ్ లోకి వచ్చి మెరుపు సెంచరీతో ఆకట్టుకున్నాడు. 60 బంతుల్లో 104 పరుగులతో రెచ్చిపోయాడు. మరో ఎండ్‌లో జోస్ బట్లర్ 35 పరుగులు చేసి ఔట్ కాగా… ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్ నిలకడగా ఆడుతూ పరుగులు (38 నాటౌట్) సాధించాడు. దీంతో ముంబైపై రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement