Thursday, May 2, 2024

హైరదాబాద్ లో రెచ్చిపోయిన రౌడీ గ్యాంగ్

హైదరాబాద్‌లో రౌడీ మూకలు రెచ్చిపోతున్నారు. తాజాగా రాజేంద్రనగర్‌లో అర్ధరాత్రి సమయంలో ఓ రౌడీ గ్యాంగ్.. కత్తులు, తల్వార్లు పట్టుకుని బీభత్సం సృష్టించింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హసన్‌నగర్‌లో రిజ్వాన్ అనే వ్యక్తిపై దాడి చేశారు. అయితే వారి నుంచి తప్పించుకున్న రిజ్వాన్ మజీద్‌లో వెళ్లాడు. ఇక, రాత్రి సమయంలో పెద్ద కేకలు వినిపించడంతో స్థానికులు ఇళ్లలో నుంచి బయటివచ్చారు. దీంతో రౌడీ గ్యాంగ్ అక్కడి నుంచి పారిపోయింది. ఈ ఘటనపై స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. తీవ్ర గాయాలతో బాధపడుతున్న రిజ్వాన్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్…పలు ఆదారాలు స్వేకరించాయి. పహాడీ షరీఫ్ వెంకటాపూర్ ప్రాంతానికి చెందిన ఖాద్రీ, దస్తగిరి తో పాటు మరో ముగ్గురిని గుర్తించారు పోలీసులు. రిజ్వాన్ కు ఖాద్రీకి మధ్య డబ్బుల విషయంలో వివాదం చెలరేగిందని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే రిజ్వాన్‌ను చంపాలని ఖాద్రి ప్లాన్ వేసినట్టు పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement