Friday, May 3, 2024

అక్కడ వేలల్లో…ఇక్కడ వందల్లో..

దేశంలో క‌రోనా కేసులు రెట్టింపు వేగంతో పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 46,951కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. మరోవైపు మహమ్మారి కారణంగా 212మంది మృతి చెందారు.దీనితో ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా నమోదు అయిన కేసుల సంఖ్య 1,16,46,081 చేరింది. అలాగే 3,34,646 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 1,11,51,468 మంది డిశ్చార్జ్ అయ్యారు. 1,59,967 మంది కరోనా కారణంగా మృతి చెందారు.

మరోవైపు తెలంగాణలో ర కొత్త‌గా 337 కేసులు నమోదు అయ్యాయి. దీంతో క‌రోనా బారిన ప‌డ్డ మొత్తం బాధితుల సంఖ్య 3,03,455కు పెరిగింది.మరో ఇద్దరు కరోనా కారణంగా మృతి చెందారు. ఇప్పటివరకు క‌రోనాతో 1,671 మంది మరణించారు. తాజాగా 181 మంది డిశ్చార్జ్​ అయ్యారు. రాష్ట్రంలో 2,958 యాక్టివ్‌ కేసులుండ‌గా, ప్రస్తుతం 1,226 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement