Saturday, May 18, 2024

డివైడర్‌ను ఢీకొట్టిన మినివ్యాన్..

హైదరాబాద్ నగర శివార్లలో ఓ మినీ వ్యాను డివైడర్ ను ఢీ కొట్టింది. శంషాబాద్ దగ్గర్లోని పెద్దషాపూర్‌ వద్ద కూలీలతో వెళ్తున్న ఓ మినీ వ్యాను డివైడర్‌ను ఢీకొట్టింది. ఘనటలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. మరో 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్‌లో 17 మంది కార్మికులు ఉన్నారని తెలిపారు. గాయపడినవారంతా బెంగాల్‌కు చెందినవారని, వరి నాట్ల కోసం నారాయణపేట్‌ జిల్లాకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. ఈ ఘనటపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ మై సీఎం.. ఏదో ఓ రోజు సాధిస్తాడు: టార్జాన్ ల‌క్ష్మీనారాయ‌ణ

Advertisement

తాజా వార్తలు

Advertisement