Saturday, May 4, 2024

ఉచిత అంబ్యులెన్స్ సర్వీస్ ను ప్రారంభించిన రేవంత్

హన్మకొండ జిల్లా ఒగులాపూర్ వద్ద ఉచిత అంబ్యులెన్స్ సర్వీస్ వాహనాలను టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. మేడారం సమ్మక్క సారక్క వన దేవతలను దర్శించుకోవడానికి వెళ్తున్న క్రమంలో హన్మకొండ జిల్లా దామెర మండలం ఒగులాపూర్ వద్ద కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ చోటు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబ్యులెన్స్ సర్వీస్ వాహనాలను రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో హన్మకొండ, వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ ఎంపీలు పోరిక బలరాం నాయక్, సిరిసిల్ల రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement