Saturday, May 4, 2024

Hath se hath jodo yatra : పాలంపేట నుండి రేవంత్ పాద‌యాత్ర ప్రారంభం

కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేప‌ట్టిన హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట నుండి తిరిగి ప్రారంభించారు. తొలుత పాలంపేటలోని రామప్ప దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ములుగు ఎమ్మెల్యే సీతక్క, కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి రామప్ప నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర ను ప్రారంభించారు. ప్ర‌జ‌ల‌ను ప‌ల‌క‌రిస్తూ.. వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ రేవంత్ పాద‌యాత్ర కొన‌సాగుతుంది. కాంగ్రెస్ హ‌యాంలో జ‌రిగిన అభివృద్ధి, అధికారంలోకి వ‌స్తే చేప‌ట్టే కార్య‌క్ర‌మాల గురించి వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement