Thursday, May 2, 2024

Delhi | చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి.. సోనియాని కలిసిన నేతలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు సహకరించాలని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీని ఓబీసీ నేతలు అభ్యర్థించారు. గురువారం పార్లమెంట్‌లోని సోనియాగాంధీ కార్యాలయంలో ఆలిండియా ఓబీసీ జ్యోతిరావు పూలే అసోసియేషన్ అధ్యక్షుడు పోతల ప్రసాద్ అన్ని రాష్ట్రాల బీసీ ప్రతినిధుల బృందంతో ఆమెను కలిశారు.

చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు. అలాగే బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసేందుకు, జనాభా లెక్కల్లో బీసీ కులగణన చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని విజ్ఞప్తి చేశారు. కులగణన జరిగితేనే బీసీలకు అన్ని రంగాల్లో వాటా న్యాయమైన వాటా దక్కుతుందని పోతుల ప్రసాద్ సోనియాగాంధీకి వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement