Sunday, April 28, 2024

Delhi | పొంగులేటి చేరికను రేణుక వ్యతిరేకించట్లేదు.. కాంగ్రెస్‌లో షరతుల మేరకు చేరికలుండవు : మాణిక్‌రావ్ థాక్రే

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడాన్ని సీనియర్ నేత రేణుక చౌదరి వ్యతిరేకించడమంటూ ఏమీ లేదని ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జి మాణిక్ రావ్ థాక్రే స్పష్టం చేశారు. తాము పోటీ చేయాలనుకునే స్థానం నుంచి మరొకరు పోటీ చేస్తారంటే కొంత ఆందోళన సహజమని అభిప్రాయపడ్డారు. కానీ పార్టీలో టికెట్లు సర్వేల ఆధారంగా, అభ్యర్థి బలాబలాల ఆధారంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.

తెలంగాణ సీనియర్ నేతలను ఢిల్లీకి పిలిపించి మాట్లాడుతున్నామని థాక్రే వెల్లడించారు. పొంగులేటి, జూపల్లి సహా కాంగ్రెస్‌లో చేరే నేతలు ఎలాంటి కండిషన్స్‌తో చేరడం లేదని అన్నారు. షరతుల మేరకు పార్టీలో నేతల చేరికలు ఏమీ ఉండవని ఆయన తేల్చి చెప్పారు. రాష్ట్రంలో చాలామంది వివిధ పార్టీల నేతలు కాంగ్రెస్‌లో చేలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక తెలంగాణ పర్యటన షెడ్యూల్ త్వరలో ఖరారు చేస్తామని మాణిక్‌రావ్ థాక్రే తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement