Thursday, May 2, 2024

గుర్తుకొస్తున్న సాయిచంద్… తన పాటల ద్వారా కట్టిపడేసిండు : రంజిత్ రెడ్డి దంపతులు

(ప్రభ న్యూస్ బ్యూరో ఉమ్మడి రంగారెడ్డి) : తెలంగాణ ఉద్యమ సమయం నుండి తన పాటల ద్వారా ఎంతో మందిని ఆకట్టుకున్న సాయిచంద్ ను ఎవరూ కూడా మరిచిపోవడం లేదు. తాను పాడిన పాటలు వింటూ గుర్తు చేసుకుంటున్నారు. తన పాటల ద్వారా వేలాది మందిని కట్టిపడేసిన సాయిచంద్ లేడనే విషయాన్ని జీర్నించు నించుకోవడం లేదు. పాటల రచయిత మిట్టేపల్లి సురేందర్ సాయి చంద్ పై రాసిన పాట విన్న చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి…ఆయన సతీమణి సీతారెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ఆదివారం మిట్టేపళ్లి ఎంపీని తన నివాసంలో కలిశారు. అప్పుడు తాను సాయిచంద్ పై రాసిన పాట విన్న ఎంపీ దంపతులు కన్నీరు కార్చారు. సాయి తో ఉన్న అనుబంధాన్ని ఎంపీ గుర్తు చేసుకుంటున్నారు. మంచి భవిషత్తు ఉన్న సాయి లేకపోవడం తీరని లోటని రంజిత్ రెడ్డి అన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement