Tuesday, April 30, 2024

National : డికె కు సుప్రీంలో ఊర‌ట .. మ‌నీ ల్యాండ‌రింగ్ కేసు విచార‌ణ నిలిపివేయాల‌ని ఆదేశం ..

క‌ర్నాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్‌పై ఉన్న మ‌నీల్యాండ‌రింగ్ కేసులో ఊర‌ట లభించింది. ఆ కేసులో విచార‌ణ‌ను నిలిపివేయాల‌ని సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించింది. 2018లో డీకేపై మ‌నీల్యాండ‌రింగ్ కేసు న‌మోదు అయిన విష‌యం తెలిసిందే.

- Advertisement -

ఈ కేసులో 2019లో డీకేను ఈడీ అరెస్టు చేసింది. ఆ త‌ర్వాత నెల రోజుల‌కు ఢిల్లీ హైకోర్టు ఆయ‌నకు బెయిల్ మంజూరీ చేసింది. ఈ కేసు విచార‌ణ నిలుపుద‌ల కోరుతూ డికె సుప్రీంను ఆశ్ర‌యించారు..దీనిపై విచార‌ణ జ‌రిపిన సుప్రీం కోర్టు ఈ కేసు ద‌ర్యాప్తును నిలిపివేయాల‌ని ఆదేశించింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement