Friday, May 17, 2024

WPL Final | అద‌ర‌కొట్టిన ఆర్సీబీ బౌల‌ర్లు.. త‌క్కువ స్కోరుకే కుప్ప‌కూలిన ఢిల్లీ !

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ ఫైనల్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీని ఆర్సీబీ బౌలర్లు మట్టికరిపించారు. ఢిల్లీ ఓపెనర్లు షఫాలీ వర్మ, కెప్టెన్ మెగ్‌ లానింగ్‌ తొలి 8 ఓవర్ల వరకు గట్టిగానే ఆడారు. అయితే 8వ ఓవర్లో బెంగళూరు బౌలర్ సోఫీ మోలినెక్స్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి ఢిల్లీకి షాకిచ్చింది. దీంతో ఢిల్లీ టాపార్డర్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో కేవంలం 113 పరుగులకు ఆలౌటైంది. బెంగళూరు బౌలర్లలో శ్రేయాంక పాటిల్‌ (4), సోఫీ మొలినెక్స్‌ (3), ఆశా శోభన (2) వికెట్లతో ఢిల్లీని చిత్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement