Sunday, April 28, 2024

WPL | త‌డ‌బ‌డ్డ ఆర్సీబీ బ్యాట‌ర్లు.. ముంబై టార్గెట్ ఎంతంటే !

ఉమెన్స్ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) ఎలిమినేటర్స్ ఆర్సీబీ బ్యాటర్లు తడబడ్డారు. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ టాపార్డర్ వైపలమైంది. తొలి ఓవర్లలోనే కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది బెంగళూరు జట్టు. ఫలితంగా.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులే చేయగలిగింది.

ఆర్సీబీ ఆల్‌రౌండర్‌ ఎల్లీస్‌ పెర్రీ (50 బంతుల్లో 66, 8 ఫోర్లు, 1 సిక్సర్) మరోసారి జట్టును ఆదుకుంది. ముంబై బౌలర్లలో హేలీ మాథ్యూస్‌, సీవర్‌ బ్రంట్, సైకా ఇషాక్ లు చరో రెండు వికెట్లు 2 దక్కించుకున్నారు. కాగా, మరి కొద్ది సేపట్లో ఢిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు 136 పరుగుల టార్గెట్‌తో చేజింగ్‌కు దిగనుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement