Sunday, April 28, 2024

ఆసియా కప్​ నుంచి రవీంద్ర జడేజా దూరం.. మోకాలికి గాయమే కారణమన్న బీసీసీఐ

భారత క్రికెట్​ జట్టు ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా ఆసియా కప్​ నుంచి వైదొలిగాడు. ఆసియా కప్​లో భాగంగా మొన్న ఆడుతున్న మ్యాచ్​లో రవీంద్ర జడేజా కుడి మోకాలికి గాయం అయ్యింది. దీని కార‌ణంగా ఇకపై జరగనున్న మ్యాచ్​లకు అతను హాజరు కాలేడని బీసీసీఐ వెల్లడించింది. రవీంద్ర జడేజా ఇప్పుడు బీసీసీఐ మెడికల్​ టీమ్​ పర్యవేక్షణలో ఉన్నాడని తెలిపింది. కాగా, జడేజా స్థానంలో అక్షర్ పటేల్​ను జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement