Monday, April 29, 2024

ఆయిల్‌ ఇండియా చైర్మన్‌గా రంజిత్‌రథ్‌

ఆయిల్‌ ఇండియా నూతన చైర్మన్‌గా రంజిత్‌రథ్‌ నియమితులయ్యారు. పీఎస్‌ఈబీ ఈమేరకు ప్రకటించింది. ప్రస్తుతం రంజిత్‌ మినరల్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎంఈసీఎల్‌) ఎండీగా ఉన్నారు. ఆయిల్‌ ఇండియా చైర్మన్‌, ఎండీగా ఉన్న సుశీల్‌ చంద్ర జూన్‌ 30న పదవీ విరమణ చేయనున్నారు. సుశీల్‌ పదవిని రంజిత్‌ భర్తీ చేయనున్నారు.

సీవీసీ, సీబీఐ నుంచి క్లియరెన్స్‌ లభించిన అనంతరం రంజిత్‌ పేరును ప్రధాని మోడీ నేతృత్వంలోని అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌కు పంపనున్నారు. కాగా రంజిత్‌రథ్‌ ఐఐటీ ఖరగ్‌పూర్‌ పూర్వ విద్యార్థి. ఎంఈసీఎల్‌లో పనిచేయడానికి ముందు ఆయన ఇండినీర్స్‌ ఇండియా లిమిటెడ్‌ జీఎంగా పనిచేశారు. అంతకుముందు ఇండియాస్‌ స్ట్రాటజిక్‌ పెట్రోలియం రిజర్వ్‌ లిమిటెడ్‌లోనూ పనిచేశారు..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement