Saturday, May 4, 2024

Ayodya: నేడు రామ్ లల్ల ప్రాణప్రతిష్ట.. ముస్తాబైన అయోధ్య..

500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ఈరోజు తెరపడనుంది. దేశమంతా సంబురంలా అంగరంగ వైభవంగా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ వేడుక జరగనుంది.

వేల మంది ప్రత్యక్ష భక్తులు, కోట్ల మంది పరోక్ష భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయి వేయికళ్లతో మనసు నిండా రాముడి రూపం నింపుకుని అభిజిల్లగ్నంలో బాలరాముడు అయోధ్య గర్భగుడిలో కొలువుదీరే ఘట్టాన్ని వీక్షించనున్నారు. మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం 1 గంటకు ముగియనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement