Friday, May 3, 2024

రాజ్యసభలో కంటతడి పెట్టుకున్న వెంకయ్య నాయుడు

రాజ్యసభ ఛైర్మ‌న్‌ వెంకయ్య నాయుడు పార్లమెంట్‌లో భావోద్వేగానికి గుర‌య్యారు. రాజ్యసభలో కొందరు ఎంపీలు మంగళవారం నాడు అనుచితంగా ప్రవర్తించడంతో సభ పవిత్రత దెబ్బతిందని వెంక‌య్య నాయుడు కంటతడి పెట్టుకున్నారు. రాజ్యసభలో జరిగిన పరిణామాలు త‌లుచుకుంటే నిద్ర‌ప‌ట్టే ప‌రిస్థితి లేద‌ని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యానికి పార్ల‌మెంటు దేవాల‌యంలాంటిద‌ని అన్నారు. సభలో పోడియం ఎక్కి నిరసన తెలపడం అంటే గర్భగుడిలో నిరసన తెలిపినట్లేనని అభిప్రాయపడ్డారు. వెంకయ్యనాయుడు ఈ మాటలు చెప్తున్న సమయంలోనూ కొందరు సభ్యులు నిరసనలు కొనసాగించారు. దీంతో రాజ్యసభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.

మ‌రోవైపు పెగాస‌స్‌, కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాలపై ప్ర‌తిప‌క్షాలు పార్ల‌మెంటులో పెద్ద ఎత్తున ఆందోళ‌న కొనసాగిస్తున్నాయి, దీంతో షెడ్యూల్ క‌న్నా ముందే లోక్‌స‌భ నిర‌వ‌ధిక వాయిదా ప‌డింది. ఎంపీలు సభా కార్యకలాపాలను అడ్డుకుంటుండ‌డంతో స‌భలో చ‌ర్చ‌లు జ‌రిగే అవ‌కాశం లేకుండా పోయింది. అయినా సభ్యుల గంద‌రగోళం మ‌ధ్యే ప‌లు కీలక బిల్లులను ఎలాంటి చర్చ లేకుండానే కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదింప‌జేసుకుంది.

ఈ వార్త కూడా చదవండి: రెండు రోజుల ముందే నిరవధిక వాయిదా పడ్డ లోక్‌సభ

Advertisement

తాజా వార్తలు

Advertisement