Sunday, May 19, 2024

Big Breaking | ఖ‌మ్మం చేరుకున్న రాహుల్ గాంధీ.. మరి కాసేపట్లో జనగర్జన సభ

ఇవాల ఖమ్మంలో ‘జనగర్జన’ స‌భ‌ జరగనుంది. ఈ బహిరంగ సభకు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ చేరుకున్నారు. హెలికాప్ట‌ర్ లో ఖ‌మ్మం స‌భ‌కు చేరుకోగా.. హెలీప్యాడ్ ద‌గ్గ‌ర రాహుల్ కాన్వాయ్ ని జనం చుట్టుముట్టారు.కారుపై నుంచి అభివాదం చేస్తూ స‌భాస్థ‌లంలోకి రాహుల్ చేరుకున్నారు.

కాగా, ఈ స‌భ‌లో ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీని ఢీకొట్టేందుకు కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌గాంధీ ఖమ్మం జిల్లా కేంద్రం పట్టణంలో ఏర్పాటు చేసిన భారీ ‘జనగర్జన’ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇవ్వాల‌ జరిగే సమావేశంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర నేతలు అధికారికంగా కాంగ్రెస్‌లో చేరనున్నారు. అలాగే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర ముగియనుంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement