Monday, May 20, 2024

పిరమిడ్‌ ధ్యాన గురువు సుభాష్‌ పత్రిజీ కన్నుమూత..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రముఖ పిరమిడ్‌ ధ్యాన గురువు సుభాష్‌ పత్రిజీ(74) కన్నుమూశారు. గతకొంత కాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇటీవల బెంగళూరులో చికిత్సతీసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం పరిస్థితి విషమించడంతో ఆయన్ను కడ్తాల్‌ మహేశ్వర పిరమిడ్‌కు తరలించారు.

ఆదివారం సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పిరమిడ్‌ ధ్యాన్‌ ట్రస్టు సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement