Monday, April 29, 2024

Protest – డిజిల్ పై ప‌న్ను ర‌ద్దు కోరుతూ ఫ్రాన్స్ లో రైతుల మ‌హా ధ‌ర్నా..

ఫ్రాన్స్‌లో మరోసారి ఆగ్రహజ్వాలలు పెల్లుబికాయి. రైతుల సమస్యలపై అక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నారు. వేలాది మంది రైతులు రోడ్ల‌పైకి వ‌చ్చి అక్క‌డే బైఠాయించారు. సాంకేతిక విధానాలను సరళీకరించాలని, వాహనాలకు డీజిల్‌ ఇంధన పన్నును రద్దు చేయాలన్న పలు డిమాండ్లతో ఫ్రాన్స్‌లోని పలు ప్రాంతాల్లో రైతులు ఈ నిరసనకు దిగారు. ఈ క్రమంలోనే లౌవ్రే మ్యూజియంలోకి చొచ్చుకెళ్లిన పర్యావరణ కార్యకర్తలు ఆందోళన చేశారు. ఆ ఇద్దరు పర్యావరణ కార్యకర్తలు పారిస్‌లోని లౌవ్రే మ్యూజియంలోని మోనాలిసా చిత్రానికి రక్షణగా ఏర్పాటు చేసిన గాజు పలకపై సూప్‌ చల్లి నిరసన వ్యక్తం చేశారు.


వ్యవసాయ రంగం దుర్భరంగా ఉందని.. మన రైతులు ప్రాణాలు కోల్పోతున్నారంటూ పర్యావరణ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ నినాదాలు చేస్తూనే మోనాలిసా చిత్రంపై సూప్ చల్లినట్లు మ్యూజియం సిబ్బంది తెలిపారు. వారిని అడ్డుకునేలోపే సూప్ చల్లారని వెల్లడించారు. అప్పటికే అప్రమత్తమై మ్యూజియం నుంచి సందర్శకులను ఖాళీ చేయించినట్లు చెప్పారు. ఈ ఘటనకు కారణమైన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement