Friday, April 26, 2024

Fighting – విద్యార్థుల ముందే చెప్పుతో కొట్టుకున్న ప్రిన్సిపాల్.. టీచ‌ర్స్

ఓ స్కూల్లో ప్ర‌ధానోపాధ్యాయురాలు..టీచ‌ర్ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ నెల‌కొంది. క్లాస్‌రూమ్‌లోకి వచ్చిన ప్రధానోపాధ్యాయురాలు కాంతి కుమారి గది కిటికీలు మూసివేయాలని అనితా కుమారి అనే టీచర్‌కు చెప్పారు. ఇందుకు ఆమె అంగీకరించకపోవడంతో ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ప్రిన్సిపల్‌ కాంతి కుమారి క్లాస్‌రూమ్‌ నుంచి బయటకు వస్తుండగా.. టీచర్‌ అనిత ఆమె వెనుకే చెప్పు పట్టుకుని వచ్చి దాడి చేశారు. అనితకు మద్దతుగా మరో టీచర్‌ కూడా ప్రిన్సిపల్‌పై దాడి చేశారు. గది పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లి ఈ ముగ్గురు కొట్టుకున్నారు. ఇదంతా విద్యార్థుల కళ్లముందే జరిగింది. అనంతరం పొలాల్లో పనిచేసే కొందరు వీరిని వారించడంతో గొడవను ఆపారు. పాఠశాలలో విద్యార్థుల కళ్లముందే మహిళా టీచర్లు తన్నుకున్న ఈ ఘటన బిహార్​లో చోటుచేసుకుంది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లే జుట్టుపట్టుకుని.. చెప్పులతో కొట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు టీచర్ల తీరుపై మండిపడుతున్నారు. ఇలాంటి టీచర్ల వల్ల మొత్తం ఉపాధ్యాయ వృత్తికే చెడ్డపేరు వస్తోందని ఫైర్ అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement