Wednesday, May 8, 2024

దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపిన ప్రధాని మోడీ.. అమిత్ షా

ప్రధాని నరేంద్ర మోడీ దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపారని కేంద్ర హొంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. సికింద్రాబాద్ లో నిర్వహించిన ప్రధాని మోడీ బర్త్ డే వేడుకల్లో అమిత్ షాతో పాటు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ… మోడీ పుట్టిన రోజు సందర్భంగా దివ్యాంగులకు ఉపకరణాలు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. పేద వర్గాలకు మోడీ ఎన్నో పథకాలు తెచ్చారన్నారు. మోడీ పేదల పక్షపాతి అని, మోడీ ఎప్పుడూ పేదల గురించి ఆలోచిస్తారన్నారు. దివ్యాంగులు సాఫీగా జీవించేలా పథకాలు రూపొందించారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement