Friday, April 26, 2024

AP | తిరుప‌తికి రానున్న రాష్ట్ర‌పతి ముర్ము.. కాన్వాయ్ రిహార్స‌ల్స్ సంద‌ర్భంగా ట్రాఫిక్ నిలిపివేత‌

తిరుపతి సిటీ, (ప్రభ న్యూస్): తిరుపతి సిటీలో రెండ్రోజుల ప‌ర్య‌ట‌న‌కు రాష్ట్రపతి వ‌స్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు కాన్వాయ్ రిహార్సల్స్ నిర్వహించారు. దీంతో తిరుపతి నుంచి 150 బైపాస్ రోడ్డు తనపల్లి నుంచి చిత్తూరు వైపు. చిత్తూరు నుంచి నాయుడుపేట వైపు వెళ్లే వాహనాలు గంటల కొద్దీ నిలిపివేయడంతో తనపల్లి క్రాస్ వద్ద ట్రాఫిక్ అంతరాయం కలిగింది. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అదేవిధంగా అన్నమయ్య సర్కిల్ నుంచి రామచంద్రపురం వైపు వెళ్లే వాహనాలు. రామచంద్రపురం నుంచి తిరుపతి వైపు వచ్చే వాహనాలు.. కూడా ఎక్క‌డిక‌క్క‌డ ఆగిపోయాయి.

రోడ్డుకు ఇరువైపులా గంటకు పైగా వాహనాలు నిలిచిపోవ‌డంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇలా వీఐపీలు వచ్చినప్పుడు ప్రతిసారి గంటల కొద్ది వాహనాలు నిలిపివేయడంతో నగర ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అత్యవసరంగా వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి వాహనాలు నిల‌ప‌కుండా ట్రాఫిక్ మ‌ళ్లింపు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని వాహ‌న‌దారులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement