Saturday, May 4, 2024

పేట్లబురుజులో వైద్యుల నిర్లక్ష్యం.. నిండు గర్భణి మృతి

హైదరాబాద్ లోని పాతబస్తీలో ఉన్న పేట్లబురుజు ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గుర్భిణి మృతి చెందింది. ఆపరేషన్ చేయకపోవడంతో సరితా భాయ్ అనే నిండు గర్భిణి మృతి చెందింది. సరితా భాయ్ ఐదు రోజుల క్రితం డెలివరీ కోసం ఆస్పత్రిలో చేరింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆమె మృతి చెందిందని బంధువులు ఆరోపించారు.  ఎన్నిసార్లు వేడుకున్న వైద్యులు స్పందించలేదంటూ కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సరిత మృతి పట్ల ఆస్పత్రిలో కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంపై చార్మినార్ పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement